News March 20, 2024

SKLM: రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు

image

ఆముదాలవలసలో గల శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఓ కార్మికుడు డ్రిల్లింగ్ మిషన్‌ను ఆపకుండా వదిలేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో ఆ డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్ పై ఓ ప్రయాణికురాలి కాలుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే కాలు విరగడంతో 108లో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 21, 2025

ఎచ్చెర్ల: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26న మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమానికి ఎచ్చెర్ల పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆర్డీవో ప్రత్యుష కార్యక్రమ ఏర్పాట్లకు మత్స్యకార గ్రామాలైన బుడగట్ల పాలెం ,జీరుపాలెం, కొవ్వాడ‌లో స్థల పరిశీలన చేశారు. వీరి వెంట డీఎస్పీ, అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.

News April 21, 2025

అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం 

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

News April 21, 2025

కంచిలిలో వ్యవసాయ పరికరాలు పంపిణీ 

image

కంచిలి మండలంలో సబ్ మిషన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే బెందాళం అశోక్,  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్  అందజేశారు. అనంతరం ఈ పథకం కింద నిర్మించిన వ్యవసాయ గోడౌన్‌ను ప్రారంభించారు. ఈ ఆధునిక పరికరాలు రైతుల వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. 

error: Content is protected !!