News April 4, 2024

SKLM: వైసీపీలో రాజీనామాల కలకలం

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వరుస రాజీనామాలతో YCP సతమతం అవుతోంది. తనకు పార్టీలో అవమానం జరిగిందంటూ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి YCPని వీడారు. తర్వాత ఆమె అడుగులు ఎటు వైపు అనేది తెలియాల్సి ఉంది. మరో YCP సీనియర్ నేత, రణస్థలం వ్యవసాయ సలహా మండలి సభ్యుడు పైడి శ్రీనివాసరావు పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. ఏకంగా ఎచ్చెర్ల ఇండిపెండెంట్ MLA అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.

Similar News

News September 9, 2025

SKLM: ఆందోళన చెందవద్దు

image

నేపాల్ రాజధాని ఖాట్మండులో అల్లర్లు, ఆందోళనలు నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యను తెలుసుకున్న శ్రీకాకుళం MP, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యాత్రికులకు ఆందోళన చెందవద్దు అని భరోసా కల్పించారు. వారందరిని సురక్షితంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే AP భవన్ కమీషనర్ ప్రవీణ్‌తో సమీక్ష నిర్వహించారు.

News September 9, 2025

శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

image

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్‌ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News September 9, 2025

మాజీ మంత్రి సీదిరి హౌస్ అరెస్ట్

image

ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.