News June 29, 2024

SKLM: సమస్యల పరిష్కారానికి జిల్లాకు మంత్రి

image

దిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి‌ మంత్రి రామ్మోహన్ నాయుడు రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 7, 2024

ఇసుకను పొందడంలో సమస్యలా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

ఇసుక‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కేటాయించ‌డం జ‌రుగుతోంద‌ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఇసుకను (https://www.sand.ap.gov.in) లో బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక పొంద‌డంలో స‌మ‌స్య‌లు ఎదురైతే, 24 గంట‌లూ ప‌నిచేసే జిల్లా స్థాయి ఫెసిలిటేష‌న్‌ సెంట‌ర్‌ను సంప్రదించాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 18004256012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించవచ్చన్నారు.

News October 6, 2024

రైలు నుంచి జారిపడి సిక్కోలు జవాన్ మృతి

image

రైలు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి శ్రీకాకుళం జిల్లా నందిగంకు చెందిన జీ.జగదీశ్వరరావు(37) అనే SSB(Sashastra Seema Bal) జవాన్ మృతిచెందాడు. సెలవుపై ఇంటికి వచ్చేందుకు గాను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నుంచి రైలులో వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు. రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 6, 2024

SKLM: పారదర్శకంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి పలువురు అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక కొర‌త లేదని, ప్రస్తుతానికి 6000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నామని వివరించారు.