News August 13, 2025
SKLM: సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు

పోలీస్ కుటుంబ సభ్యులకు సమస్య ఉంటే నేరుగా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా SP మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శ్రీకాకుళం SP కార్యాలయంలో ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విశ్రాంత పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని, బెనిఫిట్స్ సకాలంలో అందేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 13, 2025
SKLM: రాష్ట్రస్థాయి డిబేట్ పోటీల్లో సత్తాచాటిన గంగోత్రి

శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాలకు చెందిన విద్యార్థినిని గంగోత్రికి రాష్ట్ర స్థాయి డిబేట్ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. ఆర్టీఐ చట్టంపై ఇటీవల రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ బి.శామ్యూల్ చేతులు చేతులమీదుగా అవార్డు అందుకున్నారని స్థానిక ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు మంగళవారం తెలిపారు. కళాశాలలో విద్యార్థినిని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
News August 13, 2025
SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం కోర్ట్ ఆవరణలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా రాజీలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులు విషయంలో అధిక శ్రద్ధ వహించాలని కోరారు. రాజీయే రాజమార్గమని ఆయన అన్నారు.
News August 12, 2025
శ్రీకాకుళం జిల్లాకు వర్షసూచన

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండొద్దన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.