News March 15, 2025
SKLM: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు అమలు చేయాలి’

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జేసీ ఫర్మాన్ అహ్మద్లతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ఇన్ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను తెలియజేశారు.
Similar News
News September 13, 2025
శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు ఎరువులకు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను భరోసా కల్పించారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్కు పలువురు రైతులు తమకున్న ఎరువుల సమస్యలను ఫోన్లో కలెక్టర్కు వివరించారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం గ్రామానికి చెందిన ఎల్.సోమేశ్వరరావు, శ్రీముఖలింగం గ్రామానికి చెందిన రాజశేఖర్ నాయుడు, SM పురానికి చెందిన ఈశ్వరరావుతో పాటు పలు రైతులు సమస్యలను తెలియజేశారు.
News September 12, 2025
కోటబొమ్మాళి: విద్యుత్ షాక్తో లైన్మెన్ మృతి

కోటబొమ్మాళి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్మెన్ సురేష్ (32) విద్యుత్ షాక్కు గురై శుక్రవారం మృతి చెందారు. స్థానిక ఏఈ ఆధ్వర్యంలో కిష్టపురంలో సూరేశ్ మరి కొంతమందితో కలిసి 33KV విద్యుత్ లైన్ల మర్మతులు చేస్తున్నాడు. కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.
News September 12, 2025
SKLM: మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు DMHO డాక్టర్ అనిత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను జిల్లావ్యాప్తంగా వినియోగిస్తామన్నారు.