News September 10, 2024

SKLM: 15 మంది ఎస్సైలకు బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో 15 మంది ఎస్.ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలకు బదిలీలు కాగా, అందులో ఇద్దరిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం విశాఖపట్నం వీఆర్‌లో ఉన్న వి.నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసుస్టేషన్, జి.ఆర్.కె. తులసీదాసు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 25, 2025

SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

image

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 25, 2025

Way2News వార్తకు రెస్పాన్స్: యూనివర్సిటీలో భవనం ప్రారంభం

image

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో నిరుపయోగంగా భవనం దర్శనమిస్తోంది. దీనిపై అక్టోబర్ 24న ‘ఈ భవనాన్ని వినియోగంలోకి <<18091663>>తేవాలి<<>>’ అనే శీర్షికతో Way2Newsలో వార్త ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు. భవంతిని వాడుకలో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు ప్రారంభానికి పలువురి ప్రజాప్రతినిధులకు ఆహ్వానమిచ్చారు. రూ.34 కోట్లతో నిర్మితమైన భవనాన్ని క్లాస్ రూంలు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు.

News November 25, 2025

ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.