News January 27, 2025
SKLM: 28 నుంచి దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలు

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు ఈ నెల 28 నుండి 30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న శ్రీకాకుళం జిల్లా పరిషత్ లోను, 29న టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలోను, 30న పలాస ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని వివరించారు. అర్హులను గుర్తించి ఉపకరణాల పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News November 17, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
News November 17, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.


