News January 27, 2025
SKLM: 28 నుంచి దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలు

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు ఈ నెల 28 నుండి 30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న శ్రీకాకుళం జిల్లా పరిషత్ లోను, 29న టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలోను, 30న పలాస ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని వివరించారు. అర్హులను గుర్తించి ఉపకరణాల పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News February 8, 2025
SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
News February 8, 2025
నందిగాం: తమ్ముడి చితికి అక్క అంత్యక్రియలు

నందిగం మండలం హరిదాసు పేట గ్రామంలో శుక్రవారం తమ్ముడి మృత దేహానికి అక్క అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన కణితి. సుధాకర్ (24) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. తన తండ్రి మూడు సంవత్సరాల కిందట మరణించారు. తల్లి కంటి చూపు సమస్యతో బాధపడుతుంది. భార్య విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సోదరి కృష్ణవేణి తమ్ముడు సుధాకర్కు దహన సంస్కారాలు చేసింది.
News February 7, 2025
పొందూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

పొందూరులో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల అందించిన సమాచారంతో ఏస్.ఐ మధుసూదన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు (45)ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బిస్కెట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ఉందని వివరాలు తెలిస్తే 94934 74582 నంబరును సంప్రదించాలని కోరారు.