News February 20, 2025

మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్కేఎం ధర్నాలు

image

TG: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 5-13 వరకు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. విద్యుత్ సవరణ బిల్లు విషయంలోనూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిందని దుయ్యబట్టింది. ఈ ఆందోళనల్లో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరింది.

Similar News

News January 27, 2026

ఆడ తోడు కోసం పెద్ద పులి సుదీర్ఘ ప్రయాణం!

image

TG: యాదాద్రి జిల్లాలో రెండు వారాలుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాజాపేట, తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడులు చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా పులి జాడ కనుక్కోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి నదులు, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు దాటుకుంటూ 400km ప్రయాణించి, ఆడ పులి తోడు కోసం వచ్చినట్లు భావిస్తున్నారు.

News January 27, 2026

173 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

image

NCERTలో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 27, 2026

ఆటిజం పిల్లల్ని ఇలా పెంచాలి

image

ఆటిజం పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.