News September 19, 2025

SKU డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఇన్‌ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 7,798 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,250 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సెమిస్టర్‌లో 7,760 మంది పరీక్షలు రాసి 3,535 విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ డాక్టర్ రమేశ్ బాబు, పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

image

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.

News September 19, 2025

వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

image

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

News September 19, 2025

కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

image

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.