News July 19, 2024

SKY: 30 ఏళ్లకు ఎంట్రీ.. 33 ఏళ్లకు కెప్టెన్

image

సూర్య కుమార్ టీ20 క్రికెట్‌లో ఓ సంచలనం. 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్కై ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఏడాది వ్యవధిలో సెంచరీ బాది మరుసటి సంవత్సరమే నం.1 ర్యాంకుకు చేరారు. ఆ తర్వాత వరుసగా రెండు సార్లు T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. ఈ ఫార్మాట్‌కు రోహిత్ గుడ్ బై చెప్పడంతో తాజా శ్రీలంక టూర్‌కు కెప్టెన్‌గా ఎంపికై శాశ్వత సారథిగా ఉండే అవకాశాలను మెరుగుపరుచుకున్నారు.

Similar News

News January 5, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

News January 5, 2026

అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

image

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.

News January 5, 2026

మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.