News August 31, 2024

హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే: సీఎం రేవంత్

image

TG: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటుకు ప్లాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్‌ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్, హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య 4 లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

Similar News

News December 31, 2025

ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్?

image

రాజాసాబ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. తర్వాత కల్కి-2 మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని సినీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో కొన్ని రోజులు ఆయన కేటాయిస్తారని పేర్కొన్నాయి. గతేడాది జూన్‌లో రిలీజైన కల్కి ₹1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మరోవైపు స్పిరిట్, ఫౌజీ చిత్రాల్లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రావచ్చని టాక్.

News December 31, 2025

‘గల్వాన్’ గొడవ.. అసలు అప్పుడేమైంది?

image

<<18714683>>గల్వాన్ లోయ<<>>లో 2020 జూన్ 15న ఇండియా, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన చైనా ఆర్మీకి భారత సైనికులు అడ్డునిలిచారు. రాడ్లు, రాళ్లతో 6 గంటలపాటు దాడి చేసుకోవడంతో 20మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు 40 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో TGకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’లో సంతోష్‌బాబు పాత్రనే <<18686152>>సల్మాన్<<>> పోషిస్తున్నారు.

News December 31, 2025

Khaleda Zia: ఇండియాలో పుట్టి.. ఇండియా వ్యతిరేకిగా మారి..

image

బంగ్లాదేశ్ Ex PM <<18709090>>ఖలీదా జియా<<>>(80) నిన్న మరణించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌లో పుట్టిన ఆమె భారత వ్యతిరేకిగా ముద్రపడ్డారు. PMగా పదేళ్లలో గంగా జలాలు, వలసదారులు వంటి ఎన్నో అంశాల్లో మనతో ఘర్షణలకు దిగారు. భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాలో ఆశ్రయమిచ్చారు. పాక్, చైనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో నాడు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి. హసీనా హయాంలో పరిస్థితి మారింది.