News August 5, 2024

SKZR: రోడ్డు ప్రమాద ఘటనలో ఇంటర్ విద్యార్థి మృతి (Update)

image

దహెగాంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని <<13777263>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొంచవెల్లి గ్రామానికి చెందిన చిప్ప సూరజ్, చౌదరి నవీన్ కాగజ్‌నగర్ పట్టణానికి వెళ్లి సామాగ్రి కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో మూలమలుపు వద్ద ఆగి ఉన్న మరో బైక్‌ను ఢీకొన్నారు. చౌదరి నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక ఎస్సై తెలిపారు. మృతుడు ఇంటర్ చదువుతున్నాడు.

Similar News

News December 11, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.10 శాతం ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.18%, గాదిగూడలో 78.18% నమోదైంది.
*GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.

News December 11, 2025

నార్నూర్: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థి భర్త

image

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్‌లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఇన్‌ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.

News December 11, 2025

ఆదిలాబాద్‌ జిల్లాలో 40.37% పోలింగ్ నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.