News April 24, 2025

SKZR: ‘కొడుకు పుట్టడం లేదని భార్యను చంపాడు’

image

కొడుకు పుట్టడం లేదని భార్యను భర్త చంపిన సంఘటన కాగజ్‌నగర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వంజరి గ్రామానికి చెందిన జయరాం కొడుకు కోసం బానక్కా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో బుధవారం రాత్రి గొడవ జరిగింది. బానక్కను కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 24, 2025

మద్నూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం మద్నూర్, రామారెడ్డిలో 44.8, పల్వంచలో 44.7, జుక్కల్, బాన్సువాడ, డోంగ్లిలో 44.6, నస్రుల్లాబాదులో 44.5, బిచ్కుందలో 44.4, దోమకొండలో 44.1, లింగంపేటలో 43.9, అత్యల్పంగా బీబీపేట మండలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని అధికారులు సూచించారు.

News April 24, 2025

పంగులూరులో రోడ్డు ప్రమాదం

image

బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. గురువారం స్థానికుల వివరాల మేరకు.. ఓ కారు కలకత్తా నుంచి తమిళనాడు వెళ్లే క్రమంలో లారీని క్రాస్ చేస్తుండగా లారీ ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2025

ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు

image

AP: రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 27 నుంచి మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు రూ.300. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: http://www.rgukt.in/

error: Content is protected !!