News April 4, 2025
SKZR: నేటి నుంచి ఈనెల 20 వరకు పలు రైళ్ల రద్దు

నేటి నుంచి ఈనెల 20 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. బెల్లంపల్లి రేచని రోడ్డు మధ్య మూడో రైల్వే లైన్ పనుల కారణంగా భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్లు మంచిర్యాల వరకే నడపనున్నట్లు పేర్కొంది. మిగతా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా తెలిపింది.
Similar News
News November 5, 2025
SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్కు వివరించారు.
News November 5, 2025
కరీంనగర్: తల్లి ప్రేమంటే ఇదే..!

తల్లికి కొడుకంటే ఎంత ప్రేమో చెప్పే విషాదకర ఘటన ఇది. కరీంనగర్(D) వీణవంక(M) గొల్లపల్లి వాసి బోయిని లచ్చమ్మ(94) కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తరచూ తన కొడుకును తలచుకుంటూ అతడి సమాధి వద్దకు వెళ్లి ఏడుస్తూ బాధపడేది. ఈ క్రమంలో OCT10న కొడుకు సమాధి వద్దకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మనవడు వెళ్లి చూసేసరికి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉంది. చికిత్స పొందుతూ NOV 4న చనిపోయిందని SI తిరుపతి తెలిపారు.
News November 5, 2025
మరిపెడలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

మరిపెడలో సాంఘిక సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. మరిపెడలో ఈ నెల 6 నుంచి 8 వరకు 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వస్తున్నట్లు ప్రిన్సిపల్ దయాకర్ తెలిపారు. 9 రకాల ఆటలు నిర్వహించే ఈ పోటీల్లో ఖమ్మం జోన్కు చెందిన 11 పాఠశాల నుంచి 935 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 6న జరిగే ప్రారంభ వేడుకల్లో అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.


