News March 20, 2025

SLBCకి రూ.900 కోట్లు.. డిండికి రూ.400 కోట్లు

image

సాగునీటి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు రూ.900 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే డిండి ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.300 కేటాయించిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.400 కోట్లకు పెంచింది. దీంతో డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.

Similar News

News April 21, 2025

NLG: డిజిటల్ ఫీడ్ బ్యాక్‌కు కానరాని స్పందన

image

ఠాణాలకు వచ్చే పౌరులతో పోలీసుల వ్యవహారశైలి, వారందించే సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం సీఐడీ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినా ప్రజల నుంచి స్పందన కానరావడం లేదు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించకపోవడం వలన ఇది నిరుపయోగంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

News April 21, 2025

NLG: 22 నుంచి మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే..!

image

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్-1, ఎల్-2, ఎల్-3) కేటగిరీలుగా విభజించారు. ఎల్-1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్-1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.

News April 21, 2025

చిట్యాల: 25 ఏళ్ల తర్వాత అ‘పూర్వ’ కలయిక

image

చిట్యాల (M) ఉరుమడ్ల ZPHSలో 1998-99 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత దాదాపు 50 మంది ఒకేచోట చేరి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించారు. వేముల వెంకటేశం, కోనేటి యాదగిరి, పానుగుల్ల నరసింహ, కృష్ణ, యానాల సుధ, చంద్రకళ పాల్గొన్నారు. మీ స్నేహితులతో మీరేప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

error: Content is protected !!