News February 28, 2025
SLBCలో సహాయ చర్యల కోసం వెళుతున్న సింగరేణి రెస్క్యూ

SLBCలో సహాయక చర్యలు చేపట్టేందుకు సింగరేణి సంస్థకు సంబంధించిన రెస్క్యూ సిబ్బందిని ఇప్పటికే వంద మందిని అత్యాధునిక సహాయ సామగ్రితో పంపించినట్లు C&MDబలరాం పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా మరొక 200 మంది రెస్క్యూ సిబ్బందిని అదనంగా పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బందిని C&MDఅభినందించారు. సొరంగం లో చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
Similar News
News March 1, 2025
నేటి ముఖ్యాంశాలు

* రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
* మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు
* బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స
* రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్
* ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్బాబు
* టన్నెల్లో గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది: కలెక్టర్
* CT: సెమీస్ చేరిన ఆస్ట్రేలియా
News March 1, 2025
వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.
News March 1, 2025
గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.