News March 26, 2025

SLBCలో 33వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

image

శ్రీశైలం ఎడమగట్టు పరిధి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రబాద్‌లోని SLBC టన్నెల్‌లో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. బుధవారం 33వ రోజు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 8మంది గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.మరో ఆరుగురి కోసం సహాయక చర్యలను చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News April 2, 2025

వేసవి సెలవులు.. కీలక ఆదేశాలు

image

TG: వేసవి సెలవులు ఇచ్చినా పలు ఇంటర్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై ఇంటర్ బోర్డు స్పందించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులకు జూన్ 1 వరకు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అనధికారంగా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్, సెల్ఫ్ స్టడీపై దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.

News April 2, 2025

హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం

image

TG: హైదరాబాద్‌ శివార్లలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి మృత్యువాత పడినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్‌ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.

News April 2, 2025

MBNR: ఖబర్దార్ రేవంత్ రెడ్డి: డీకే అరుణ

image

‘ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూములు వేలం వేయడం సరికాదు..ఆ భూములు ఎవరి జాగిరు కాదు’ అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

error: Content is protected !!