News February 28, 2025
SLBCలో సహాయ చర్యల కోసం వెళుతున్న సింగరేణి రెస్క్యూ

SLBCలో సహాయక చర్యలు చేపట్టేందుకు సింగరేణి సంస్థకు సంబంధించిన రెస్క్యూ సిబ్బందిని ఇప్పటికే వంద మందిని అత్యాధునిక సహాయ సామగ్రితో పంపించినట్లు C&MDబలరాం పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా మరొక 200 మంది రెస్క్యూ సిబ్బందిని అదనంగా పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బందిని C&MDఅభినందించారు. సొరంగం లో చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
Similar News
News February 28, 2025
విశాఖ-గుణుపూర్ పాసెంజర్కు అదనపు బోగి

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ – గుణుపూర్ (58505/06) పాసెంజర్కు అదనపు బోగి వేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు అదనపు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా అదనపు బోగి సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
News February 28, 2025
జూరాల ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై గ్రౌటింగ్ హోల్స్లు బోరుబావిని తలపిస్తున్నాయి. డ్యామ్ లీకేజీలను అరికట్టేందుకు సిమెంట్ గ్రౌటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హోల్స్ బోరు బావిని తలపించేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును చూసేందుకు ప్రయాణికులు, సందర్శకులు వస్తుంటారు. గద్వాల్-ఆత్మకూరుకు ఇదే ప్రధాన రహదారి. ఈ ప్రమాదాలు జగరక ముందే పీజేపీ అధికారులు మూతలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
News February 28, 2025
మంత్రులకు చేపకూర, విద్యార్థులకు పస్తులా?: కేటీఆర్

TG: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. SLBC ప్రమాదంతో ఓ వైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు. అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులలోని ఎస్టీ బాలురు హాస్టల్ విద్యార్థులను శివరాత్రి రోజున గుడిలో అన్నదానానికి వెళ్లి తినమనడం దారుణమన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.