News March 26, 2025
SLBCలో 33వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

శ్రీశైలం ఎడమగట్టు పరిధి నాగర్కర్నూల్ జిల్లా అమ్రబాద్లోని SLBC టన్నెల్లో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. బుధవారం 33వ రోజు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 8మంది గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.మరో ఆరుగురి కోసం సహాయక చర్యలను చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News March 30, 2025
ఆహారంలో బొద్దింక, ఎలుక.. 2 వేల శాఖల్ని మూసేసిన హోటల్

జపాన్లో అతి పెద్ద రెస్టారెంట్ చెయిన్గా పేరున్న సూకియా తమకు చెందిన 2వేల హోటల్ శాఖల్ని తాత్కాలికంగా మూసేసింది. ఆహారంలో ఎలుక, బొద్దింక రావడంతో హోటల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. షేర్ విలువ పతనమైంది. ఈ నేపథ్యంలో సూకియా కస్టమర్స్కు క్షమాపణలు చెప్పింది. అన్ని రెస్టారెంట్లను మూసేసి పూర్తిగా పరిశుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా క్లీనింగ్ స్టార్ట్ చేసింది.
News March 30, 2025
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివానం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు రాష్ట్ర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
News March 30, 2025
శ్రీశైల ఆలయ క్యూలైన్లను పరిశీలించిన నంద్యాల ఎస్పీ

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, భక్తుల కంపార్ట్మెంట్ లు, క్యూలైన్లు, లడ్డు కౌంటర్ తదితరాలను పరిశీలించారు. విధులలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.