News March 9, 2025
SLBC వద్ద భయం.. భయం.!

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.
Similar News
News January 28, 2026
నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సలు.. వాహనాల నియంత్రణ

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ శ్రీ అళహరి మధుసూదన్ Way2News తెలిపారు. భక్తులు నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలుపాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News January 28, 2026
MBNR: నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ బుధవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, 18 మున్సిపల్స్కు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 30 వరకు నామినేషన్స్ దాఖలు. 31న వాటిని పరిశీలన. ఫిబ్రవరి 3 నామినేషన్ల ఉపసంహరణ. ఫిబ్రవరి 11 పోలింగ్. ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫిబ్రవరి 16 మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది.
News January 28, 2026
పాలమూరు మేయర్గా పాగా వేసేదెవరు..?

పాలమూరు కొత్త కార్పొరేషన్కు మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్ బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో తమ అభ్యర్థులను బరిలో నింపేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. తొలి మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో 5 మంది హోరాహోరీగా పోటీ పడుతుండగా, బీఆర్ఎస్, BJPలో మేయర్ అభ్యర్థి ఎవరు అనే దానిపై స్పష్టత రాలేదు. మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు వేచి చూడాల్సిందే.


