News February 28, 2025
SLBCలో సహాయ చర్యల కోసం వెళుతున్న సింగరేణి రెస్క్యూ

SLBCలో సహాయక చర్యలు చేపట్టేందుకు సింగరేణి సంస్థకు సంబంధించిన రెస్క్యూ సిబ్బందిని ఇప్పటికే వంద మందిని అత్యాధునిక సహాయ సామగ్రితో పంపించినట్లు C&MDబలరాం పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా మరొక 200 మంది రెస్క్యూ సిబ్బందిని అదనంగా పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బందిని C&MDఅభినందించారు. సొరంగం లో చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
Similar News
News February 28, 2025
మొలకలచెరువు వద్ద మృతదేహం కలకలం.!

మొలకలచెరువు సరిహద్దులోని చీకటి మానుపల్లి పేపర్ మిల్లు వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ములకలచెరువు SI నరసింహుడు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 45ఏళ్ళ గుర్తుతెలియని వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తించారు. ఛాతిపై పి.బాబాజాన్ అనే పచ్చబొట్టు కలిగి, నీలిరంగు షర్ట్ ధరించాడని తనకల్లు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చినట్లు చెప్పారు.
News February 28, 2025
ఉగ్రవాదిని అనుకుని గన్తో కాల్చబోయారు: సునీల్ శెట్టి

వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగిన కొన్ని రోజులకు తనకు USలో భయానక పరిస్థితి ఎదురైనట్లు సునీల్ శెట్టి వెల్లడించారు. ‘2001లో నేను కాంటే మూవీ షూటింగ్ తర్వాత LAలోని హోటల్కు వెళ్తుండగా నా లుక్ను చూసి టెర్రరిస్టు అని అనుమానించారు. కిందికి రాకపోతే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సంకెళ్లు వేశారు. హోటల్ మేనేజర్ నేనెవరో చెప్పడంతో వదిలేశారు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News February 28, 2025
వరంగల్: పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవి సురేశ్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.