News August 17, 2024

ఉదయం 5గంటలకు నిద్రపోతా: షారుఖ్

image

అందరితో పోలిస్తే తన దినచర్య పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అమెరికన్ యాక్టర్ మార్క్ వాల్‌బర్గ్ నిద్రలోంచి లేచే సమాయానికి నేను పడుకుంటా. షూటింగ్ రోజుల్లో ఉదయం 5 గంటలకు నిద్రపోయి 10 గంటలకు లేస్తాను. రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తా. షూట్‌కి వెళ్లి అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి స్నానం, వర్కౌట్ చేసి పడుకుంటా’ అని తెలిపారు.

Similar News

News January 28, 2026

బాఫ్టా రేసులో మన ‘బూంగ్’.. మణిపురీ మ్యాజిక్!

image

ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మణిపురీ చిత్రం ‘Boong’ ప్రతిష్ఠాత్మక BAFTA 2026 నామినేషన్లలో చోటు సంపాదించింది. లక్ష్మీప్రియా దేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతోంది. మణిపుర్ నేపథ్యంతో సాగే ఓ బాలుడి కథతో తీసిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రచ్చ చేస్తోంది. గ్లోబల్ స్టేజ్‌పై ఇండియన్ రీజినల్ సినిమా ఇలా మెరవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News January 28, 2026

రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ శుభాకాంక్షలు

image

TG కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర రేపు ప్రారంభంకానుంది. ఈ జాతరను వైభవంగా జరుపుకోవాలని CM రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని US నుంచి CM ఫోన్‌లో ఉన్నతాధికారులకు సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. మరోవైపు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క-సారలమ్మను మాజీ CM KCR సైతం ప్రార్థించారు.

News January 27, 2026

ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రూ.2వేలు?

image

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలను అన్నదాతలకు అందించే అవకాశం ఉంది. కాగా రైతులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. లేదంటే డబ్బులు జమ కావు.