News June 20, 2024
స్లో స్టార్ట్.. 3 వికెట్లు కోల్పోయిన భారత్

టీ20 వరల్డ్ కప్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. 9.3ఓవర్లకు 75 రన్స్ చేసింది. రోహిత్(8), పంత్(20), కోహ్లీ(24) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఫరూకీ 1, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, దూబే ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభం కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. 6 ఓవర్లలో 47 రన్స్ చేసింది.
Similar News
News December 11, 2025
అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్లో సూచించారు.
News December 11, 2025
పదేళ్ల తర్వాత జాతీయ స్థాయి పోటీలు: రాంప్రసాద్ రెడ్డి

AP: రాష్ట్రంలో పదేళ్ల తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యోనెక్స్-సన్రైజ్ 87వ జాతీయ పోటీల పోస్టర్ను CM చంద్రబాబు ఆవిష్కరించగా ఆయన్ను ప్రారంభోత్సవానికి మంత్రి ఆహ్వానించారు. DEC 24-28వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని CMకు వివరించారు.
News December 11, 2025
సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం: పవన్

AP: గతంలో ఎన్నడూ లేని విధంగా 10వేల మందికి పైగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని Dy.CM పవన్ అన్నారు. ‘ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి. నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. గత ప్రభుత్వంలో పోస్టింగ్, ప్రమోషన్కు ఓ రేటు కార్డు ఉండేది. కూటమి పాలనలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం’ అని ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో ఆయన అన్నారు.


