News October 14, 2024
బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న స్మృతీ ఇరానీ!
మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రూపాలీ గంగూలీ కీలకపాత్ర పోషిస్తున్న ‘అనుపమా’లో స్మృతీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాలు, టీవీ షోల్లో కనిపించారు. తెలుగులో ‘జై బోలో తెలంగాణ’లో ఆమె ఉద్యమకారిణి, తల్లి పాత్ర పోషించారు. అయితే ఆమె కమ్బ్యాక్ గురించి ‘అనుపమా’ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.
Similar News
News October 14, 2024
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిల్లో ఉంటున్న విద్యార్థులను సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని సూచించారు. అటు వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.
News October 14, 2024
మునావర్ ఫారూఖీ హత్య కుట్ర.. భగ్నం!
స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ Sepలో చేసిన కుట్రను నిఘా వర్గాలు భగ్నం చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన ఓ కాల్పుల కేసు విచారణలో ఈ కుట్ర వివరాలు వెలుగుచూశాయి. అయితే, అప్పటికే ఢిల్లీ వెళ్తున్న మునావర్పై విమానంలో, హోటల్లో రెక్కీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇది కచ్చితంగా అతని హత్యకు జరిగిన కుట్రగా భావించి మునావర్ను అక్కడి నుంచి తప్పించారు.
News October 14, 2024
ప్రముఖ కమెడియన్ కన్నుమూత
హాస్యనటుడు, ‘ది కపిల్ శర్మ’ షో ఫేమ్ అతుల్ పర్చురే(57) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. పలు మరాఠీ సీరియళ్లు, హిందీ సినిమాలు, టీవీ షోల్లో ఆయన ప్రేక్షకులను అలరించారు. తెలుగులో గత ఏడాది విడుదలైన ‘రూల్స్ రంజన్’ సినిమాలోనూ ఆయన నటించారు.