News February 2, 2025
టెన్త్ విద్యార్థులకు ‘స్నాక్స్’ ప్రారంభం
TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించే కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. మార్చి 20వ తేదీ వరకు దీనిని ప్రభుత్వం అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, ఉల్లిపాయ పకోడి రోజుకొక రకం ఇవ్వనున్నారు. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు స్నాక్స్ అందిస్తున్నారు.
Similar News
News February 2, 2025
NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.
News February 2, 2025
దేశ అప్పు రూ.181 లక్షల కోట్లు
దేశంపై అప్పుల భారం పదేళ్లలో ఏకంగా 192 శాతం పెరిగింది. 2015 మార్చి 31 నాటికి రూ.62 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పు రూ.175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది.
News February 2, 2025
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేయాలి: సీఎం
TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుండటం, ప్యాకేజీ 3 పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించే 8kms ఓపెన్ కెనాల్ పనులు ఆగిపోయాయని, ఎస్టిమేట్స్ రివైజ్ చేయాలని కాంట్రాక్టర్ అడగడంతో సమస్య వచ్చినట్లు అధికారులు వివరించారు.