News November 9, 2024
సోషల్ మీడియా వారియర్లను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు: జగన్

చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను చట్టవిరుద్ధంగా, అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని YS జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను దెబ్బతీశారు. ఆయనకు కొరుకుడుపడనిది సోషల్ మీడియా ఒక్కటే. పోలీసులను వాడుకుంటూ YCP కార్యకర్తలను హింసిస్తున్నారు. ఫేక్ పోస్టులు చేసిన టీడీపీ అఫీషియల్ అకౌంట్పై చర్యలు తీసుకున్నారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 4, 2025
జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్కు, 1 కాంగ్రెస్కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.
News November 4, 2025
న్యూస్ రౌండప్

☛ జూబ్లీహిల్స్ బైపోల్: బీజేపీకి జనసేన మద్దతు
☛ రైతులను కలిసే అర్హత జగన్కు లేదు: మంత్రి నిమ్మల
☛ కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. గోవాలో పని చేస్తున్న శిబూ, జనేశ్ను అరెస్ట్ చేసిన పోలీసులు
☛ బిహార్లో ముగిసిన ఎన్నికల ప్రచారం.. నవంబర్ 6న తొలి విడత పోలింగ్
☛ శ్రీకాకుళం: విద్యార్థుల చేత <<18193619>>కాళ్లు నొక్కించుకున్న<<>> టీచర్ సస్పెండ్
☛ ఎంపీ చిన్నితో ముగిసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ  
News November 4, 2025
సిగాచీ బాధితులకు ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు: హైకోర్టు

TG: సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన బాధితులకు పరిహారం చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బాధితులకు ఇస్తామన్న ₹కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. మృతుల కుటుంబాలకు ₹25లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా మొత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఏజీ తెలిపారు. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది.


