News October 23, 2024
జట్టును నిర్ణయించేది సోషల్ మీడియా కాదు: గంభీర్
టీమ్ ఇండియాలో క్రికెటర్ KL.రాహుల్ చోటుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కోచ్ గంభీర్ స్పందించారు. వాటితో తమకు అవసరం లేదని, మేనేజ్మెంట్ ఏం అనుకుంటుందనేదే తమకు ముఖ్యమన్నారు. జట్టును ఎంపిక చేసేది నెటిజన్లు కాదన్నారు. రాహుల్ మంచి ఫామ్లో ఉన్నారని, అతడు పెద్ద స్కోర్లు చేయాలని భావిస్తున్నాడని తనకు అనిపిస్తోందని గౌతీ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్తో రెండో టెస్టు రేపు ప్రారంభం కానుంది.
Similar News
News October 23, 2024
ప్రపంచ రికార్డు: 20 ఓవర్లలో 344 రన్స్ బాదేశారు!
పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న 314 రన్స్ను బద్దలుగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లలో సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ(15 సిక్సులు) చేశారు. టీ20 వరల్డ్ కప్నకు క్వాలిఫయర్ మ్యాచులు ఆఫ్రికా దేశాల మధ్య జరుగుతున్నాయి.
News October 23, 2024
జిన్పింగ్, మోదీ మధ్య కొనసాగుతున్న చర్చలు
చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజన్లో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో వీరు భేటీ అయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరు సమావేశమవడం గమనార్హం. లద్దాక్లో ఎల్ఏసీ వెంబడి మిలిటరీ పెట్రోలింగ్పై రెండు రోజుల క్రితం ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.
News October 23, 2024
వెంకయ్య నాయుడి మనవడి పెళ్లిలో సీఎం
AP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి పెళ్లికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు సీఎంతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.