News February 4, 2025

రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా

image

TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్‌కో <>సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో చోట 500kW నుంచి 2MW ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1MW ఉత్పత్తికి 3-4 ఎకరాల భూమి అవసరం అవుతుంది. kW పవర్‌కు ₹3.13 చెల్లించి ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది.

Similar News

News November 19, 2025

PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

image

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.

News November 19, 2025

నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

image

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్‌గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.

News November 19, 2025

GHMC ఎన్నికల్లో జనసేన పోటీ!

image

తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్‌గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.