News July 3, 2024
ప్రజా సమస్యలు పరిష్కరించడమే తప్పైపోయింది: YCP మాజీ MLA

AP: ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయడం వల్లే ఓటమి పాలయ్యామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తప్పై పోయిందని చెప్పారు. ‘ఎవరైనా అడిగితేనే మేలు చేయాలి. అడగనిదే ఇస్తే దేనికీ విలువ ఉండదు. అదే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో జనం సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం కూడా తప్పిదమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 26, 2025
భారత్ చెత్త రికార్డు

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్లో రన్స్ పరంగా భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.
News November 26, 2025
ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 26, 2025
RRCATలో 150 పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(<


