News September 2, 2025
కొందరు నా కుర్చీకే ఎసరు పెడతామంటారు: సీఎం రేవంత్

TG: ఈ తరానికి వైఎస్ ఒకరే, కేవీపీ ఒకరే ఉంటారని సీఎం రేవంత్ కొనియాడారు. కేవీపీ రామచంద్రరావులాంటి వారు తనకు ఎక్కడా కనిపించలేదని ప్రశంసించారు. ‘కేవీపీలా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలి. కానీ కొందరు నా దగ్గరికి వచ్చి కేవీపీలా ఉంటానంటారు. ఎవరినైనా మొదటి వారం ఆఫీస్ లోపలికి రానిస్తే, రెండో వారం నా కుర్చీలోనే కూర్చుంటామంటారు. ఇది నా అనుభవంతో చెబుతున్నా’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Similar News
News September 21, 2025
గందరగోళంతో టెన్షన్ టెన్షన్

H1B వీసా ఫీజు పెంపుపై వైట్హౌస్ ముందే క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా మంది భారతీయులు ఆందోళనకు గురయ్యారు. శుభకార్యాలు, ఇతర పనుల కోసం ఇండియాకు వచ్చిన వారు హడావిడిగా అమెరికా వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ టికెట్ ధర రూ.34-37వేల నుంచి రూ.70-80 వేల వరకు పెరిగింది. అయితే ఇప్పటికే ఆ వీసా ఉన్నవారికి ఫీజు వర్తించదని కాసేపటి క్రితం అమెరికా ప్రభుత్వం <<17779352>>క్లారిటీ<<>> ఇవ్వడంతో లక్షల మంది ఊపిరి పీల్చుకున్నారు.
News September 21, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

* వరంగల్ వేయి స్తంభాల గుడిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి
* ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
* ప్రతి 20kmలకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ
* సొంతూరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న జాగృతి చీఫ్ కవిత
News September 21, 2025
మైథాలజీ క్విజ్ – 12

1. లక్ష్మణుడి భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
2. మహాభారతంలో సత్యవతి, శంతనుల కుమారులు ఎవరు?
3. వేదాల ప్రకారం.. మొదట మరణించిన వ్యక్తి ఎవరు?
4. మానస సరోవరం ఏ దేశంలో ఉంది?
5. సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు.
<<-se>>#mythologyquiz<<>>