News June 22, 2024
NEETపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి: VSR

NEET యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్షకు ఏపీ నుంచి హాజరైన 60వేల మందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మంది విద్యార్థుల కోసం ఆ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే వారికి ప్రజలు, విద్యార్థుల జీవితాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.
Similar News
News October 15, 2025
నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

అతి పెద్ద దేశవాళీ క్రికెట్ సమరం ‘రంజీ ట్రోఫీ 2025-26’ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ 91వ ఎడిషన్లో 38 జట్లు తలపడుతున్నాయి. విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్గా, కేరళ జట్టు రన్నరప్గా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచులు జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఖేల్ టీవీలో లైవ్ చూడొచ్చు. ఈ సీజన్లో మొత్తం 138 మ్యాచులు జరగనున్నాయి. అత్యధికంగా ముంబై జట్టు 42సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచింది.
News October 15, 2025
కోడి పిల్లలను షెడ్డులోకి వదిలే ముందు జాగ్రత్తలు

కోడి పిల్లలను షెడ్డులోకి వదలడానికి 10 రోజుల ముందే షెడ్డును శుభ్రపరచి, గోడలకు సున్నం వేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లను క్లీన్ చేయాలి. వరి పొట్టును 2-3 అంగుళాల మందంలో(లిట్టర్) నేలపై వేసి.. దానిపై పేపరును పరచాలి. కోడి పిల్లల మేత, నీటి తొట్లను బ్రూడరు కింద ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టను వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి.
News October 15, 2025
గుడికి వెళ్తే తప్పకుండా తల స్నానం చేయాలా?

దైవ దర్శనానికి వెళ్లేముందు తలస్నానం తప్పక చేయాలని పండితులు సూచిస్తున్నారు. మన మనస్సు నిత్యం కామ, క్రోధ, లోభం వంటి అరిషడ్వర్గాలతో నిండి, అపవిత్రంగా ఉంటుంది. ఆ మనసును శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక శక్తి మనకు తక్షణమే లభించదు. కాబట్టి కనీసం శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచుకుని, శుచిగా దైవ దర్శనం చేసుకోవాలి. శరీరంలాగే మన మనస్సు కూడా శుద్ధంగా, నిర్మలంగా ఉండాలని భగవంతుడిని వేడుకోవాలి. <<-se>>#DHARMASANDEHALU<<>>