News June 22, 2024

NEETపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి: VSR

image

NEET యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్షకు ఏపీ నుంచి హాజరైన 60వేల మందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మంది విద్యార్థుల కోసం ఆ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే వారికి ప్రజలు, విద్యార్థుల జీవితాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

Similar News

News November 16, 2025

సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

image

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్‌లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.

News November 16, 2025

ప్రభుత్వం విఫలం.. క్వింటాల్‌కు ₹2వేల నష్టం: KTR

image

TG: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘ప్రస్తుతం క్వింటాల్‌కు ₹8,110 కనీస మద్దతు ధర ఉంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో రైతులకు ₹6,000-7,000 మాత్రమే దక్కుతోంది. రైతులు క్వింటాల్‌పై ₹2,000 వరకు నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనకుండా CCI కఠినంగా వ్యవహరిస్తోంది’ అని ఫైరయ్యారు.

News November 16, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 6

image

30. సుఖానికి ఆధారం ఏది? (జ.శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (జ.భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? (జ.కుమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (జ.మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (జ.దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (జ.ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (జ.సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (జ.అహింస)
<<-se>>#YakshaPrashnalu<<>>