News March 20, 2025

రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్‌

image

AP: రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్‌గా కేపీసీ గాంధీని నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

Similar News

News December 18, 2025

ఎక్కువ వెల గొడ్డును, తక్కువ వెల గుడ్డను కొనరాదు

image

ఎక్కువ ధర పెట్టి పశువును కొన్నప్పుడు, అది అనుకోకుండా మరణిస్తే యజమానికి భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే మరీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని బట్టలు కొంటే అవి చిరిగిపోయి, రంగు వెలిసి, ముడుచుకుపోతాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో ముడిపడి ఉన్న ప్రమాదం, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి. అనవసర ఆడంబరానికి పోయి ఎక్కువ వెల పెట్టకూడదు, అతి తక్కువ ధరకు ఆశపడి నాణ్యత లేని వస్తువును తీసుకోకూడదు.

News December 18, 2025

కాలసర్ప దోషం: గుర్తించే విధానమిదే..

image

కాలసర్ప దోషం తీవ్రమైన ప్రభావం చూపుతుందట. ఇది ఉన్న వ్యక్తికి 42 ఏళ్ల పాటు వైఫల్యాలు, మానసిక ఒత్తిడి, వృత్తిలో అభివృద్ధి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ దోషాన్ని గుర్తించడానికి సూచనలు కలలు అని పండితులు చెబుతున్నారు. కలలో పాములు కనిపించడం తీవ్రమైన కాలసర్ప దోషానికి సంకేతాలుగా భావిస్తారట. ఇలాంటి కలలు వస్తే వెంటనే శివుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వంటి నివారణలు పాటించాలని సూచిస్తున్నారు.

News December 18, 2025

ఈరోజు చివరి అవకాశం!

image

మార్గశిర మాసంలో గురువార వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ నెలలో ఇదే చివరి గురువారం. ఈ వ్రతంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతారు. సంపద, సంతోషం, శ్రేయస్సు ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ వ్రతం చేస్తారు. ఇది మార్గశిరంలో ఏ ఒక్క గురువారం చేసినా సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం వలన మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజును వినియోగించుకోండి.