News September 11, 2025

సోనియా గాంధీకి కోర్టులో ఊరట

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. భారత సిటిజన్ అవ్వకముందే ఆమె ఓటు హక్కు పొందారని, విచారణ జరపాలని న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. ‘1980లో సోనియా ఓటు హక్కు పొందారు. ఆ తర్వాత 1982లో ఎన్నికల సంఘం దాన్ని తొలగించింది. అంటే ఆమె అక్రమంగా ఓటర్ ఐడీ పొందారని స్పష్టమవుతోంది’ అని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.

Similar News

News September 11, 2025

అమరావతిలో బ్యాంకర్ల బృందం పర్యటన

image

AP: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల బృందం పర్యటించింది. నగర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టు కింద అమలవుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యకలాపాలను పరిశీలించింది. CRDA అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులకు సూచనలు చేసింది. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సరీ, CRDA స్కిల్ హబ్ ప్రాంగణం, N9 ట్రంక్ రోడ్ పనులు, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్‌ల వద్ద రక్షణ చర్యలను చెక్ చేసింది.

News September 11, 2025

గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

image

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.

News September 11, 2025

‘మిరాయ్‌’లో ప్రభాస్?

image

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. రేపు రిలీజ్ నేపథ్యంలో.. హింట్ ఇస్తూ హీరో తేజ ట్వీట్ చేశారు. ‘ప్రభాస్ తన సహృదయంతో ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చారు. మూవీ ప్రారంభంలో రెబల్ సర్‌ప్రైజ్ మిస్ అవకండి’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా క్యామియో ఉంటుందా అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ కానుంది.