News February 7, 2025
కలియుగ శ్రవణ కుమారులు!

తల్లిదండ్రులను కావడిపై మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రాణాలు సైతం కోల్పోయిన శ్రవణ కుమారుడు ఎందరికో ఆదర్శం. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు మహాకుంభమేళాలో కనిపించారు. తమ తల్లిదండ్రులను చెరో వైపు కూర్చోబెట్టుకుని శ్రవణ కుమారుడి తరహాలో కావడిపై మోశారు. వయసైపోయిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో ఉంచుతున్న ఈ రోజుల్లో ఇలా వారికి సేవ చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. మీరేమంటారు?
Similar News
News November 23, 2025
TODAY HEADLINES

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్
News November 23, 2025
ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
News November 23, 2025
11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

AP: 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు కళ్యాణం శివశ్రీనివాసరావు, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్కు సత్యనారాయణ రాజు, ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్కు విక్రమ్, ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్కు రామ్ప్రసాద్, స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీకి ముక్తియార్ను నియమించింది.


