News November 24, 2024
త్వరలో భారత్కు బ్రిటన్ ‘కింగ్’

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణి క్వీన్ కెమెల్లాతో కలిసి త్వరలో భారత్కు రానున్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో 2022లో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఇప్పుడు INDతో పాటు పాక్, బంగ్లాలోనూ ఆయన పర్యటిస్తారు. ఈ ఏడాది క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కోలుకున్న ఆయన OCTలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్కు తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్సెస్ సెంటర్కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే ఛాన్సుంది.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<