News October 10, 2024
త్వరలోనే వైసీపీ దుకాణం శాశ్వతంగా మూత: ఎమ్మెల్యే జీవీ

AP: మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ రాస్తామంటున్నారని, ఆయన చేసిన పాపాలకు రామకోటి రాసుకుంటే పుణ్యం వస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఆయనకు కలలో కూడా లోకేశ్ రెడ్ బుక్కే తిరుగుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం శాశ్వతంగా మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News July 9, 2025
దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్లో<<>> పర్యటించారు.
News July 9, 2025
ఏపీ సీఎంకు తెలంగాణ MLA విజ్ఞప్తి

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును అచ్చంపేట MLA వంశీకృష్ణ కోరారు. నిన్న శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన CMను డ్యాంపైన కలిసి మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణ ఆవశ్యకతపై MLA వినతిపత్రం ఇచ్చారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి AP నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారని, వంతెన నిర్మాణం పూర్తైతే 100KM దూరం తగ్గుతుందని వివరించారు.
News July 9, 2025
క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి వేగంగా అడుగులు

AP ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. రూ.4వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం తాజాగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఐకానిక్ భవనం కోసం డిజైన్లు రూపుదిద్దుకుంటుండగా, సీఎం ఇటీవల పలు మార్పులు సూచించారు.