News February 26, 2025

‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు’

image

TG: సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. ధర్మారానికి చెందిన రాకేశ్(19) HYDలో చదువుకుంటున్నాడు. 3 రోజుల క్రితం తల్లిదండ్రులకు కాల్ చేసి తనకు చదువు అంటే ఇష్టం లేదని చెప్పాడు. ఇంటికి రమ్మనగా బయలుదేరాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కాచిగూడలో సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ‘అమ్మానాన్న క్షమించండి.. యముడు పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. బై.. బై..’ అని లేఖలో పేర్కొన్నాడు.

Similar News

News February 26, 2025

రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: ఉత్తమ్

image

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. SLBC పూడికలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. సమగ్ర ప్రణాళికతో తాము ముందుకెళ్తున్నామని, గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దెబ్బ తిన్న TBMను వేరు చేస్తామని పేర్కొన్నారు.

News February 26, 2025

సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ కీలక సూచనలు

image

TGలో 2016 నుంచి పీఎం ఆవాస్ యోజనను ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్‌ను ప్రధాని మోదీ ప్రశ్నించారు. మార్చి 31 నాటికి ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టును సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లకు, రెండు రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని, 3 నీటి పారుదల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.

News February 26, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వినతులివే

image

☛ HYDలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి
☛ RRR ఉత్త‌ర భాగంలో 90% భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ద‌క్షిణ భాగాన్ని మంజూరు చేయాలి
☛ RRRకు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి
☛ మూసీ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల సాయం
☛ గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 222.7ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి సహకారం
☛ TGకి అదనంగా 29 IPS పోస్టులు మంజూరు చేయాలి
☛ సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాలి

error: Content is protected !!