News March 12, 2025
SOSకు కాల్ చేసిన ప్రకాశం ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్లో అత్యవసర సేవలు అందిస్తున్న శక్తి యాప్ పనితీరు గురించి ఆరా తీశారు. ఎస్పీ స్వయంగా తన ఫోన్ నుంచి SOSకు కాల్ చేసి సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే అన్ని కాల్స్కు రెస్పాండ్ కావాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు.
Similar News
News December 14, 2025
నర్సాపూర్కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.
News December 14, 2025
తెలంగాణలో పొదిలి, మార్కాపురం వాసులు మృతి.!

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందిన ఘటన తెలంగాణలో జరిగింది. పొదిలికి చెందిన సాయి ప్రసాద్, మార్కాపురంకి చెందిన రవితేజ, కంభంకి చెందిన వంశీకృష్ణలు నిజామాబాద్లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు శుక్రవారం రాత్రి రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాగులో దిగారు. ఒక్కసారిగా ఊపిరాడక ప్రసాద్, రవితేజ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 14, 2025
నర్సాపూర్కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉదయం 5.30కి బయలుదేరే ఈ రైలు ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.


