News October 19, 2024
ఆరోజు అనుమతి ఇవ్వకుంటే సౌందర్య బతికేవారు: దర్శకుడు

మోహన్బాబు, సౌందర్య జంటగా వచ్చిన ‘శివ్శంకర్’ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య కన్నుమూశారు. ఆ ఘటనపై ఆ మూవీ డైరెక్టర్ రాజేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘షూటింగ్లో నిర్మాత మోహన్బాబు ఎవరికీ సెలవులిచ్చేవారు కాదు. ఎన్నికల ప్రచారం ఉండటంతో సౌందర్యకు మాత్రం సెలవిచ్చారు. ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతికేవారేమో. ఆమె మరణం కారణంగా సినిమా సరిగ్గా తీయక ఫ్లాపైంది’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News December 21, 2025
నేడే పల్స్ పోలియో.. నిర్లక్ష్యం చేయకండి

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. తప్పని పరిస్థితుల్లో ఇవాళ మిస్ అయితే రేపు, ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ న్యూస్ షేర్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ను అలర్ట్ చేయండి.
News December 21, 2025
ధనుర్మాసం: ఆరో రోజు కీర్తన

‘‘తెల్లవారింది, పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. స్వామి ఆలయంలోని శంఖధ్వని నీకు వినబడలేదా? పూతనను, శకటాసురుని సంహరించిన ఆ శ్రీకృష్ణుడే పాలకడలిపై శయనించిన శ్రీమన్నారాయణుడు. మునులు, యోగులు భక్తితో చేస్తున్న ‘హరి! హరి!’ నామస్మరణతో మేమంతా మేల్కొన్నాము. కానీ నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి? ఓ గోపికా! వెంటనే మేల్కొను. మాతో కలిసి ఆ స్వామి వ్రతంలో పాల్గొని మోక్షాన్ని పొందుదాం, రా!’’ <<-se>>#DHANURMASAM<<>>
News December 21, 2025
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగి చూడండి!

లేవగానే లెమన్ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలుసు. అయితే దానికి చిటికెడు పసుపు కలిపితే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘లెమన్ వాటర్లో ఉండే విటమిన్ సీ శరీరంలోని టాక్సిన్స్ను క్లియర్ చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ వల్ల లివర్ ఫంక్షన్ మెరుగవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా, కిడ్నీలకు కావాల్సిన సపోర్ట్ను కూడా అందిస్తుంది’ అని చెబుతున్నారు.


