News March 12, 2025

సౌందర్య మృతి.. మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు

image

అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘శంషాబాద్‌లోని జల్‌పల్లిలో ఆరెకరాల భూమిని విక్రయించేందుకు సౌందర్య, ఆమె సోదరుడు నిరాకరించడం పెద్ద వివాదమైంది. ఇదే హత్యకు దారి తీసింది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్‌బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు’ అని ఆయన తెలిపారు.

Similar News

News March 26, 2026

50ల్లోనూ యవ్వనంగా.. మలైకా సీక్రెట్ ఇదే?

image

3 రకాల వాటర్ షాట్స్ థెరపీ 52 ఏళ్ల వయసులోనూ తనను ఫిట్‌&అందంగా ఉంచుతోందని మలైకా అరోరా తెలిపారు.
ఇమ్యూనిటీ షాట్: అల్లం, పసుపు, పుదీనా, తులసి ఆకులు, చియా సీడ్స్, తేనె కలిసిన నీటిని తాగడం.
డైజెస్టివ్ షాట్: రాత్రి గ్లాస్ వాటర్‌లో టీస్పూన్ చొప్పున వాము, జీలకర్ర, సోంపు, మెంతి గింజలు నానబెట్టిన నీరు తీసుకోవడం.
గ్లో షాట్: అలోవేరా జెల్ కలిపిన నీటిలో అవసరమైతే చియా సీడ్స్, సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగడం.

News March 26, 2026

ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ఆసిఫాబాద్, సంగారెడ్డి, MDK, కామారెడ్డిలో ఉరుములు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, WGL, జనగామ, SDPT, యాదాద్రి, RR, మేడ్చల్, MBNR, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, PDPL, నాగర్ కర్నూల్, వనపర్తి, NRPT, GDWL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News March 26, 2026

రాష్ట్రంలో కాగితాలపైనే పోలీసులు: జగన్

image

AP జంగిల్ రాజ్‌గా మారిపోయిందని, కాగితాలపై మాత్రమే పోలీసులు కన్పిస్తున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో 17ఏళ్ల గిరిజన బాలికపై హత్యాచారం వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. ఇక ఇవాళ మార్కాపురం ఘటనలో మరో భయానక వైఫల్యం బయటపడిందన్నారు. పలుమార్లు 100కు ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పారు. CBN ప్రభుత్వంలో PR స్టంట్లు తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు.