News March 12, 2025
మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న <<15732112>>ఆరోపణలన్నీ<<>> అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం. క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.
Similar News
News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.
News March 12, 2025
నిలిచిన లావాదేవీలు.. స్పందించిన SBI

తమ బ్యాంక్ లావాదేవీలు ఫెయిల్ కావడంపై దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI స్పందించింది. ‘SBI యూపీఐ లావాదేవీల్లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీని కారణంగా కస్టమర్ల లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఖాతాదారులు UPI లైట్ లావాదేవీలు వినియోగించుకోవచ్చు’ అని వెల్లడించింది. అటు తమ లావాదేవీలూ ఫెయిల్ అయ్యాయని, డబ్బులు కట్ అయ్యి ప్రాసెసింగ్లో పడ్డాయని యూజర్లు పోస్టులు పెడుతున్నారు.
News March 12, 2025
బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్టులు, 2024లో టీ20లకు గుడ్ బై పలికారు. ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకున్నారు. బంగ్లా తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు చేశారు. 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.