News April 24, 2024
DCలోకి సౌతాఫ్రికా విధ్వంసకర ప్లేయర్

గాయం కారణంగా టోర్నీకి దూరమైన మిచెల్ మార్ష్ స్థానాన్ని భర్తీ చేసేపనిలో ఢిల్లీ క్యాపిటల్స్ పడింది. అతడి స్థానంలో సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు రస్సీ వాండర్ డస్సెన్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. IPL 2024 మినీ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. ఇప్పుడు అతడి బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో కొనుగోలు చేసినట్లు టాక్. కాగా డస్సెన్ గత PSLలో 7 మ్యాచ్ల్లోనే 364 రన్స్ బాది సెకండ్ లీడింగ్ రన్స్కోరర్గా నిలిచారు.
Similar News
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.


