News September 7, 2024

భారత పర్యాటకులకు సౌతాఫ్రికా గుడ్‌న్యూస్

image

భారత టూరిస్టులకు దక్షిణాఫ్రికా గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలో వీసా లేకుండా 90 రోజులు పర్యటించేందుకు అనుమతినివ్వనుంది. తమ టూరిస్టుల్లో అత్యధికులు భారత్, చైనా నుంచే ఉన్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత పర్యాటకుల సంఖ్య ఏటా 16వేలుగా ఉండగా, ఈ ఏడాది చివరికి దాన్ని లక్షకు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Similar News

News November 27, 2025

RITESలో 252 పోస్టులు.. అప్లై చేశారా?

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<>RITES<<>>)లో 252 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, బీఆర్క్, డిప్లొమా, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.rites.com/

News November 27, 2025

భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్‌పై రూ.4,000 పెరిగి రూ.1,80,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.9వేలు ఎగబాకింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,27,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,17,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి

News November 27, 2025

రొటీన్ మ్యానర్‌లో DNA టెస్టు కుదరదు: హైకోర్టు

image

దంపతుల మధ్య చట్టపరమైన వివాదాలు ఉన్నప్పుడు రొటీన్ మ్యానర్‌లో పిల్లలకు DNA టెస్టు కుదరదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యభర్తలు కలిసి ఉండే అవకాశం లేనప్పుడే ఈ పరీక్ష చేస్తారని చెప్పింది. ‘నా భార్య వారమే మా ఇంట్లో ఉంది. చదువులేని నాతో జీవించడానికి ఇష్టపడలేదు. 2011 మే నుంచి పుట్టింట్లోనే ఉండగా 2012 DECలో బిడ్డకు జన్మనిచ్చింది. అందువల్ల DNA టెస్టు చేయాలి’ అని భర్త కోరగా కోర్టు తోసిపుచ్చింది.