News April 15, 2025
పోలీసింగ్లో సౌతిండియా టాప్.. AP, TG ర్యాంకులు ఎంతంటే?

ఫోర్త్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం పోలీసింగ్, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయ సహాయంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. ఈ విభాగాల్లో కర్ణాటక టాప్ ప్లేస్ దక్కించుకోగా AP, TG, KL, TN టాప్-5లో ఉన్నాయి. బెంగాల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది సర్వేలో TG 11వ స్థానంలో నిలవగా ఈసారి మూడో ప్లేస్కి దూసుకొచ్చింది. ఇక గత పదేళ్లలో జైళ్లలోని ఖైదీల సంఖ్య 50శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
Similar News
News April 18, 2025
DANGER: రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ధూమపానం వల్ల ఎలాంటి అనర్థాలున్నాయో సిట్టింగ్ వల్ల కూడా అంతే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఎముకలు పెళుసుగా మారతాయి. అలాగే, గుండె జబ్బులు, టైప్-2 డయాబెటీస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలొస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకే 45 నిమిషాలకొకసారి 10 నిమిషాలు నడిస్తే మంచిది’ అని సూచిస్తున్నారు.
News April 18, 2025
మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.
News April 18, 2025
క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.