News October 27, 2024

దక్షిణ కొరియాకు ‘ఒంటరి మరణాల’ సమస్య

image

దక్షిణ కొరియాలో భారీగా పెరుగుతున్న ‘ఒంటరి మరణాలు’ ఆ ప్రభుత్వానికి ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒంటరితనంతో బాధపడుతున్న వేలాదిమంది నడి వయసు పురుషులు తమవారికి తెలియకుండా ఒంటరిగా మరణిస్తున్నారు. ఈ తరహా మరణాలు గత ఏడాది 3661 నమోదయ్యాయి. ఈ సమస్యని చక్కదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో 327 మిలియన్ డాలర్ల విలువైన చర్యలు తీసుకోవాలని సియోల్ నిర్ణయించింది. ఇప్పటికే పౌరులకోసం 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.

Similar News

News November 24, 2025

గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.

News November 24, 2025

భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

image

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.