News December 29, 2025
SP హెచ్చరిక.. నిబంధనల మధ్యే న్యూ ఇయర్కి స్వాగతం

నూతన సంవత్సర వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
Similar News
News December 31, 2025
పాలకోడేరు: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

కుముదువల్లి పంచాయతీ చినపేటలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కలెక్టర్ కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
News December 31, 2025
సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్ఫుల్!

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్ రూమ్లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News December 31, 2025
జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.


