News February 8, 2025

7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

image

AP: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

Similar News

News December 29, 2025

ఉత్తర ద్వార దర్శనం.. ఏ సమయంలో చేసుకోవడం ఉత్తమం?

image

వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామునే చేసుకోవడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఏకాదశి తిథి రేపు ఉదయం 7:51కి మొదలై, ఎల్లుండి పొద్దున5:01 వరకు ఉంటుంది. శాస్త్రరీత్యా డిసెంబర్ 30నే వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ శుభ దినాన ఏ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకున్నా.. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో చేసే ఈ దర్శనం అజ్ఞానాన్ని తొలగించి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.

News December 29, 2025

హైదరాబాద్‌లో 80 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>హైదరాబాద్‌<<>>లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE, B.Tech, MSc(కెమిస్ట్రీ), MBA, CA/ICWAI, PG డిప్లొమా, M.Com ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bdl-india.in

News December 29, 2025

పిల్లల్లో మూర్ఛ ఉంటే ఏం చేయాలంటే?

image

మూర్ఛ వ్యాధి విషయంలో చాలా మంది అలర్ట్​గా ఉండట్లేదని నిపుణులు అంటున్నారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చికిత్సను మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు కొనసాగించాలని సూచిస్తున్నారు. అప్పుడే 80-90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్‌ అవుతుందని చెబుతున్నారు.