News February 8, 2025

7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

image

AP: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

Similar News

News December 20, 2025

HISTORY: HYD నిజాం.. మస్క్ కంటే రిచ్!

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర ఆదాయం ఇటీవలే $677B దాటింది. కానీ ఇంతకంటే ఎక్కువ ఆదాయాన్ని 85ఏళ్ల క్రితమే HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కలిగి ఉండేవారని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 1937 నాటికే ఆయన సంపద విలువ నేటి లెక్కల ప్రకారం సుమారు ₹150 లక్షల కోట్లు ($1.8 ట్రిలియన్లు). అపారమైన భూములు, గోల్కొండ వజ్రాలు, రాజప్రాసాదాలతో అప్పట్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఆయన గుర్తింపు పొందారు.

News December 20, 2025

ICMRలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ICMRలో 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/

News December 20, 2025

‘రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చేందుకు నిధులివ్వండి’

image

AP: ఉద్యానహబ్‌గా రాయలసీమను మార్చేందుకు వచ్చే బడ్జెట్‌లో స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని.. కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ‘రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 93 క్లస్టర్లలో 18 ప్రధాన ఉద్యానపంటలు పండుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానసాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు పెంచేందుకు వచ్చే మూడేళ్లలో రూ.41 వేల కోట్లు అవసరం. దీనికి తగ్గట్లుగా 2026-27 బడ్జెట్‌లో నిధులివ్వండి’ అని కోరారు.