News September 23, 2024
2026 అక్టోబరుకల్లా మార్స్పైకి వ్యోమనౌకలు: మస్క్

2026 అక్టోబరుకల్లా అంగారకుడిపై వ్యోమనౌకలు ల్యాండ్ అయ్యేలా చేస్తామని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. ఆసక్తి కలవారందరినీ మార్స్పైకి పంపించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రోదసియానం అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ‘వచ్చే రెండేళ్లలో మానవరహిత వ్యోమనౌకలు ఐదింటిని పంపిస్తాం. అవి సురక్షితంగా ల్యాండ్ అయితే ఆ తర్వాతి నాలుగేళ్లలో మానవసహిత వ్యోమనౌకల్ని ప్రయోగిస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News October 25, 2025
వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ సవరణ!

దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వచ్చే వారం నుంచి EC చేపట్టనుంది. తొలి దశలో 10-15 రాష్ట్రాల్లో ప్రారంభించనుందని తెలుస్తోంది. 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముందుగా SIR చేపట్టనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు జరుగుతున్న, త్వరలో జరిగే రాష్ట్రాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించనుంది. కాగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో 2026లో ఎన్నికలు జరగనున్నాయి.
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. సోనూసూద్ రిక్వెస్ట్

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో నటుడు సోనూసూద్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్ది పెట్టాలి. ఆపరేటర్లకు నెల సమయం ఇవ్వండి. పర్మిట్ రెన్యూవల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్లు ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పండి. నితిన్ గడ్కరీ సార్ చర్యలు తీసుకోండి. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి’ అని ట్వీట్ చేశారు.
News October 25, 2025
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

<


