News September 23, 2024
2026 అక్టోబరుకల్లా మార్స్పైకి వ్యోమనౌకలు: మస్క్

2026 అక్టోబరుకల్లా అంగారకుడిపై వ్యోమనౌకలు ల్యాండ్ అయ్యేలా చేస్తామని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. ఆసక్తి కలవారందరినీ మార్స్పైకి పంపించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రోదసియానం అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ‘వచ్చే రెండేళ్లలో మానవరహిత వ్యోమనౌకలు ఐదింటిని పంపిస్తాం. అవి సురక్షితంగా ల్యాండ్ అయితే ఆ తర్వాతి నాలుగేళ్లలో మానవసహిత వ్యోమనౌకల్ని ప్రయోగిస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News November 9, 2025
‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్లో చూసి..

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<


