News August 24, 2025
బీసీ బిల్లుపై అమిత్షాను కలిసిన స్పీకర్

TG: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సదస్సు సందర్భంగా ఆయనను కలిసి బిల్లు ప్రస్తావన తెచ్చారు. ‘అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. దీని గురించి సీఎం రేవంత్ మిమ్మల్ని ప్రత్యేకంగా కలిశారు’ అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని అమిత్షా బదులిచ్చారు.
Similar News
News August 25, 2025
నేడు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. వర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి. అటు వర్సిటీ భూముల సర్వే, నియామకాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది.
News August 25, 2025
ఈ సమయాల్లో నీరు తాగితే?

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.
News August 25, 2025
దక్షిణాఫ్రికా పేరిటే ఆ రికార్డు

వన్డేల్లో అత్యధిక సార్లు 400+ రన్స్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా(8) పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టీమ్ ఇండియా(7), ఇంగ్లండ్(6), <<17503678>>ఆస్ట్రేలియా<<>>(3), NZ(2), SL(2), జింబాబ్వే(1) ఉన్నాయి. చిత్రమేమిటంటే వెస్టిండీస్, PAK, బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఈ మార్క్ అందుకోలేకపోయాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్లు(సిరీస్లో కనీసం 3 వన్డేలు) గెలిచిన జట్టుగా సౌతాఫ్రికా(9) రికార్డు నెలకొల్పింది.